టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకునే ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి

YSRCP General Secretary Sajjala Ramakrishna Reddy Responds Over MLA Kotamreddy's Issue,YSRCP General Secretary,Sajjala Ramakrishna Reddy,MLA Kotamreddy,Mango News,Mango News Telugu,Having endured many insults in party,with admiration for CM Jagan Nellore MLA Kotam Reddy's,Kotam Reddy sensational comments,mango news,mango news telugu,Ap It Minister Gudivada Amarnath,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన కోటంరెడ్డి అనూహ్యంగా పార్టీపై, ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన బుధవారం మీడియా సమావేశంలో తన ఫోన్ ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ పరోక్షంగా సీఎం జగన్ పైన విమర్శలు ఎక్కుపెట్టడంతో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.

ఈరోజు బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి సర్పంచ్‌ల సమావేశంలో పాల్గొన్న సజ్జల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోటంరెడ్డి ఉద్దేశాలేంటో అర్ధమయ్యాక ఇక ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసిన ఆయన సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్‌లను నమ్ముకుని కాదని సజ్జల తెలిపారు. పదవి రాలేదని అసంతృప్తి ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలని, అంతేకాని ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయటం పద్దతి కాదని అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇంకా ఎవరినీ నియమించలేదని, తమ పార్టీలో సమర్ధులకు కొదవ లేదని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి కొంత మంది నేతలను ఎలా లాక్కోవాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =