ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతుండడంతో 48 గంటల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలుకు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నామని, ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు.
ఈ రెండు రోజులు నిత్యావసర వస్తువుల దుకాణాలు కూడా తెరిచేందుకు అవకాశం లేదన్నారు. పూర్తిస్థాయి లాక్డౌన్ సమయంలో ఎవరూ బయటకు వచ్చిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రెడ్ జోన్ ప్రాంతమైన నరసరావుపేట పట్టణంలో అధికారులు పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు. మరోవైపు గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో కొత్తగా మరో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ వైరస్ వలన జిల్లాలో 8 మంది మృతి చెందారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu