ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5783 సాంపిల్స్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1259 పాజిటివ్ కేసులకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం 970 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా కట్టడికి రాష్ట్రప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రతి 10 లక్షల జనాభాకు గానూ 1396 టెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూల్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోనే కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 54
- చిత్తూరు – 74
- కర్నూల్ – 332
- కడప – 65
- తూర్పుగోదావరి – 39
- పశ్చిమ గోదావరి – 54
- నెల్లూరు -82
- ప్రకాశం – 56
- గుంటూరు – 254
- కృష్ణా – 223
- శ్రీకాకుళం – 4
- విజయనగరం – 0
- విశాఖపట్నం – 22
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu