ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వబోతోంది. అయితే గత కొంత కాలంగా ఏపీలో సాధారణ బదిలీలపై నిషేధం అమలవుతోంది. తాజాగా ఆ నిషేధాన్ని సడలిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు. దీంతో జూన్ 17వ తేదీ లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మరో పది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF