ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10175 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10175 కేసులతో కలిపి సెప్టెంబర్ 10, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 5,37,687 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 72,229 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరులో తొమ్మిది మంది, కడపలో తొమ్మిది మంది, నెల్లూరులో తొమ్మిది మంది, కృష్ణాలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, గుంటూరులో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4702 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 4,35,647 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 10040 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 97338 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu