ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు, మూడు రాజధానుల ఏర్పాటు సహా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షా తో సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశమునట్టు సమాచారం. అలాగే అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానునట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, అవినాష్రెడ్డి, కొందరు రాష్ట్ర అధికారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ