ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా రికార్డ్ స్థాయిలో 10759 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 22, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,97,462 కు చేరింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1474, కర్నూల్ లో 1367, శ్రీకాకుళంలో 1336, గుంటూరులో 1186, తూర్పుగోదావరిలో 992, విశాఖపట్నంలో 844 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 3992 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు.
ఇక కరోనా వలన కృష్ణాలో ఐదుగురు, చిత్తూరులో ఐదుగురు, కర్నూల్ లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, అనంతపూర్, కడప మరియు విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7541 కి పెరిగింది. గత 24 గంటల్లో 41,871 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,58,35,169 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 22, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 9,97,462
- కొత్తగా నమోదైన కేసులు : 10759
- కొత్తగా నమోదైన మరణాలు : 31
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 9,22,977
- యాక్టీవ్ కేసులు : 66944
- మొత్తం మరణాల సంఖ్య : 7541
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ