ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించిన కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2016, జనవరి నెలలో కాపు ఉద్యమం జరిగిన సమయంలో తుని, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 51 కేసులను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదే ఉపసంహరించుకోగా, తాజాగా తుని రైలు ఘటనకు సంబంధించి మరో 17 కేసుల్లో విచారణను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జూలై 27, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu