ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1085 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 24, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,63,843 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6956 కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉన్నారు. గత 24 గంటల్లో 1447 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు. అలాగే గడిచిన 24 గంటల్లో 65,102 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 97,27,321 చేరుకుంది. ఇక కరోనా వలన కృష్ణాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, నెల్లూరులో ఒకరు మరియు తూర్పుగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6956 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 24, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,63,843
- కొత్తగా నమోదైనా కేసులు : 1085
- నమోదైన మరణాలు : 8
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,43,863
- యాక్టీవ్ కేసులు : 13024
- మొత్తం మరణాల సంఖ్య : 6956
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ