ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 16, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 288, చిత్తూరులో 217, కృష్ణాలో 155, ప్రకాశంలో 141, నెల్లూరులో 135, పశ్చిమగోదావరిలో 126 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 1,248 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 14 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 14044కి పెరిగింది. గత 24 గంటల్లో 61,178 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 2,75,36,639 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 16, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 20,34,786
- కొత్తగా నమోదైన కేసులు : 1,367
- కొత్తగా నమోదైన మరణాలు : 14
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 20,06,034
- యాక్టీవ్ కేసులు : 14,708
- మొత్తం మరణాల సంఖ్య : 14,044
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ