ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 91,253 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 21,320 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2923, అనంతపూర్ లో 2804, చిత్తూరులో 2630, విశాఖపట్నంలో 2368, పశ్చిమగోదావరిలో 1762, శ్రీకాకుళంలో 1466 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,75,372 కు చేరుకుంది.
ఇక కరోనా వలన చిత్తూరులో పది మంది, కృష్ణాలో పది మంది, విజయనగరంలో పది మంది, తూర్పుగోదావరిలో తొమ్మిది మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది, కర్నూల్ లో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9580 కి పెరిగింది. గత 24 గంటల్లో 21274 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 12,54,291 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ