న్యూజిలాండ్ కీలక నిర్ణయం, భారత్ నుండి వచ్చే ప్రయాణికులపై తాత్కాలికంగా నిషేధం

Mango News, New Zealand, New Zealand bars entry of travellers from India, New Zealand PM Jacinda Ardern bans entry of India, New Zealand Prime Minister Jacinda Ardern, New Zealand suspends entry for travellers from India, New Zealand suspends entry of travellers from India, New Zealand Temporarily Suspended Entry for All Travellers, New Zealand Temporarily Suspended Entry for All Travellers from India, New Zealand Temporarily Suspended Entry for All Travellers from India Amid Surge in Covid-19 Cases, New Zealand travel ban

భారత్ లో గత కొన్నిరోజులుగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రయాణికుల విషయంలో న్యూజిలాండ్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సొంత పౌరులతో సహా భారత్ నుండి వచ్చే ప్రయాణికులందరి ప్రవేశాన్ని తాత్కాలికంగా రెండు వారాలపాటు నిలిపివేస్తున్నట్టుగా న్యూజిలాండ్ ప్రకటించింది. ఏప్రిల్‌ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్‌ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ వెల్లడించారు.

ఇటీవల విదేశాల నుంచి న్యూజిలాండ్ కు వచ్చిన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, వీరిలో 17 మంది భారతదేశానికి చెందిన వారుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రయాణికులెవరూ న్యూజిలాండ్‌ లోకి రాకుండా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికుల నిషేధం వలన వచ్చే ఇబ్బందులను పరిగణిస్తామని, అలాగే ఈ సమయంలో ప్రయాణాలను తిరిగి ప్రారంభించడానికి రిస్క్ మేనేజ్మెంట్ చర్యలను న్యూజిలాండ్ ప్రభుత్వం పరిశీలిస్తుందని ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 1 =