ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా 3263 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654, విశాఖపట్నంలో 454, గుంటూరులో జిల్లాలో 418, కృష్ణాలో 318 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,28,664 కు చేరుకుంది.
ఇక కరోనా వలన చిత్తూరులో ఐదుగురు, నెల్లూరులో ఇద్దరు, అనంతపూర్, కడప, కర్నూల్ మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7311 కి పెరిగింది. గత 24 గంటల్లో 1091 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,98,238 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,115 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ