ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 3,030 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు మీడియా బులెటిన్ లో తెలిపారు. కాకినాడ జిల్లాలో 1, ఎన్టీఆర్ జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 1 కేసు నమోదవగా, మిగతా 22 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇక కరోనా వలన కొత్తగా మరణాలు సంభవించలేదు. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఆరుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని తెలిపారు. ఇక ఏప్రిల్ 22 నాటికీ ఏపీలో మొత్తం 3,35,11,274 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ