ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 7,547 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 19, గుంటూరులో 9, చిత్తూరులో 8, పశ్చిమగోదావరి జిల్లాలో 6, ప్రకాశంలో లో 6 నమోదయ్యాయి. కర్నూల్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,478 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,729 గా ఉంది. గత 24 గంటల్లో 237 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 23,02,862కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 887 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,31,89,416 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ