ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 35,907 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 7224 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 17, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,55,455 కు చేరుకుంది. ఇక కరోనా వలన చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కడప, కృష్ణా మరియు విజయనగరంలో జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7388 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 2332 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 9,07,598 కు చేరింది. అలాగే ప్రస్తుతం 40469 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,56,42,070 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(7224):
- తూర్పుగోదావరి – 906
- కర్నూల్ – 507
- కృష్ణా – 493
- కడప – 200
- గుంటూరు – 903
- చిత్తూరు – 1051
- అనంతపూర్ – 420
- నెల్లూరు – 624
- ప్రకాశం – 588
- శ్రీకాకుళం – 662
- విశాఖపట్నం – 470
- విజయనగరం – 304
- పశ్చిమగోదావరి – 96
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ