ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7965 కరోనా పాజిటివ్ కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7965 కేసులతో కలిపి సెప్టెంబర్ 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 5,75,079 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 61,529 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరులో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, కర్నూల్ లో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో నలుగురు, కడపలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, విజయనగరంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు మరియు గుంటూరులో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4972 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 4,76,903 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 9764 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 93204 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu