ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37,922 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 8987 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు వంటి నాలుగు జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 20, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,76,987 కు చేరుకుంది.
ఇక కరోనా వలన నెల్లూరులో ఎనిమిది మంది, చిత్తూరులో ఐదుగురు, కడపలో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం మరియు విజయనగరంలో జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7472 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 3116 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 9,15,626 కు చేరింది. అలాగే ప్రస్తుతం 53889 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,57,53,679 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(8987):
- నెల్లూరు – 1347
- శ్రీకాకుళం – 1344
- గుంటూరు – 1202
- చిత్తూరు – 1063
- తూర్పుగోదావరి – 851
- కర్నూల్ – 758
- విశాఖపట్నం – 675
- కృష్ణా – 441
- విజయనగరం – 330
- ప్రకాశం – 305
- కడప – 297
- అనంతపూర్ – 275
- పశ్చిమగోదావరి – 99
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ