జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రూ.కోటి చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కోశాధికారి ఎ.వి.రత్నంలకు పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద బీమా చేయించే నిమిత్తం గత రెండు సంవత్సరాలుగా ఏటా రూ.కోటి చొప్పున విరాళాన్ని అందజేస్తున్న పవన్ కళ్యాణ్, మూడో ఏటా తనవంతుగా రూ.కోటి విరాళాన్ని ఇచ్చినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE