దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పరీక్షలను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు సహా సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశాయి. ఈ క్రమంలో మే నెలలో జరగాల్సిన ఐసీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం నాడు కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) ప్రకటించింది. విద్యార్థులు, టీచింగ్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఖచ్చితమైన మరియు నిష్పాక్షికమైన క్రైటీరియాలో మార్కులు కేటాయించి పదోతరగతి ఫలితాలను వెల్లడిస్తామని, త్వరలోనే ఫలితాలు విడుదల చేసే తేదీపై ప్రకటన చేస్తామని చెప్పారు.
ఇక సీఐఎస్సీఈ అనుబంధ స్కూల్స్(ఐఎస్సీ ఉన్న) క్లాస్ 11 అడ్మిషన్స్ ప్రారంభించాలని, అలాగే క్లాస్ 11 విద్యార్థులకు సంబంధించి ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ ను త్వరగా రూపొందించాలని పేర్కొన్నారు. మరోవైపు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొన్నారు. జూన్ మొదటివారంలో సమీక్ష నిర్వహించి 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ పై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ