ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 20 వేలు దాటింది. కొత్తగా 10093 కేసులు నమోదవడంతో జూలై 29, బుధవారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 120390 కు చేరుకున్నట్టు ప్రకటించారు. మొత్తం కేసుల్లో 117495 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2895 మంది ఉన్నారు. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 1213 కి చేరింది. ఇప్పటికి 55406 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో కలిపి మొత్తం 63771 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 12358
- చిత్తూరు – 9080
- కర్నూల్ – 14471
- కడప – 6477
- తూర్పుగోదావరి – 17739
- పశ్చిమ గోదావరి – 10356
- నెల్లూరు – 5753
- ప్రకాశం – 4443
- గుంటూరు – 12816
- కృష్ణా – 6259
- శ్రీకాకుళం – 5582
- విజయనగరం – 3602
- విశాఖపట్నం – 8559
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu