ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి (మే 20) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. “తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం” అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు ట్వీట్ చేస్తూ, “తెలుగువారి ధీరత్వానికి, పౌరుషానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అచంచలమైన దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో పదవుల కోసం కాకుండా ప్రజల కోసం తపించిన చరితార్థుడు ప్రకాశం గారి వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని ప్రజాసేవలను స్మరించుకుందాం” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF