ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆగస్టు 10, సోమవారం ఉదయం 10 గంటల నాటికీ 25,34,304 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 9-ఆగస్టు 10 (9AM-9AM) వరకు 24 గంటల వ్యవధిలో 46,999 శాంపిల్స్ (విఆర్డీఎల్+ట్రూనాట్+నాకో(22688), ర్యాపిడ్ యాంటిజెన్ -24331) ను పరీక్షించినట్టు తెలిపారు. దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల్లో ప్రస్తుతానికి తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉండగా ఆంధప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. అయితే మిలియన్ జనాభాకు దేశంలోనే అత్యధికంగా 47459 పరీక్షలు నిర్వహించి ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుంది.
ఏపీలో కరోనా వివరాలు:( ఇతర రాష్ట్రాలు, విదేశాలు నుంచి వచ్చిన వారితో కలిపి)
- ఆగస్టు 10 నాటికీ నిర్వహించిన కరోనా పరీక్షలు: 25,34,304
- నెగటివ్ వచ్చిన వారు – 22,98,779
- పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య: 2,35,525
- మొత్తం యాక్టీవ్ కేసులు – 87773
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య – 145636
- కరోనా మరణాలు – 2116
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu