రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరు నగరాల నుంచి కోల్కతా విమానాశ్రయానికి వచ్చే విమానాల రాకపోకలపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న ఢిల్లీ, ముంబై, పుణే, నాగ్పూర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కోల్కతాకు వచ్చే విమానాల సర్వీసులను ముందుగా జూలై 4 నుంచి జూలై 19 వరకు రద్దు చేశారు. ఆ తర్వాత నిషేధం గడువును ఆగస్టు 15 వరకు పొడిగించగా, తాజాగా ఆగస్టు 31 వరకు విమాన రాకపోకలపై నిషేధం అమల్లో ఉంటుందని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పశ్చిమబెంగాల్ లో ఆగస్టు 10, సోమవారం నాటికీ 98,459 కరోనా కేసులు నమోదవగా, 2,100 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 70,328 మంది డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 26,031 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu