విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆగస్టు 9 వ తేదీ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సోమవారం నాడు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.కొడాలి రాజగోపాలరావుతో పాటుగా, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్ కె.సుదర్శన్, కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని పోలీసులు ఈ రోజు జడ్జ్ ముందు హాజరుపరచగా, 14 రోజుల పాటు జడ్జి రిమాండ్ విధించారు. అనంతరం వారిని పోలీసులు మచిలీపట్టణం స్పెషల్ సబ్ జైలుకు తరలించినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu