ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,171 కు చేరుకుంది. గత 24 గంటల్లో 59410 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 295 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 32, కర్నూల్ జిల్లాలో 12, కృష్ణా జిల్లాలో 45, కడప జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 39, అనంతపూర్ జిల్లాలో 30, నెల్లూరు జిల్లాలో 24, ప్రకాశం జిల్లాలో 12, శ్రీకాకుళంలో 9, విశాఖపట్నంలో 22, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 21 కేసులు నమోదయ్యాయి.
ఇక కరోనా వలన కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7126 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 368 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,74,223 కు చేరింది. అలాగే ప్రస్తుతం 2822 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జనవరి 7 నాటికీ ఏపీలో మొత్తం 1,21,64,531 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ