కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో వివరించారు.
కరోనా నేపథ్యంలో టీటీడీ నూతన మార్గదర్శకాలు:
- జూన్ 8, 9 తేదీల్లో గుర్తింపు పొందిన టీటీడీ ఉద్యోగులకు దర్శనం.
- జూన్ 10న స్థానికులకు దర్శనానికి అనుమతి.
- జూన్ 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనాలకు అనుమతి.
- ప్రతిరోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి.
- ఆన్లైన్ టికెట్స్ ద్వారా రోజూ 3వేల మంది భక్తులకు అనుమతి.
- ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం.
- ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలలోపు మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి.
- కాలినడక భక్తులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే అనుమతి.
- వైరస్ వ్యాప్తి దృష్ట్యా శఠగోపం, తీర్ధం ఇవ్వరు.
- శ్రీవారి ఆలయంలో ఉపఆలయాల వద్ద దర్శనం ఉండదు.
- పుష్కరిణిలో స్నానాలకు భక్తులను అనుమతించరు.
- అలిపిరి నుంచి మాత్రమే కాలినడక భక్తులకు అనుమతి.
- శ్రీవారిమెట్టు మార్గం ద్వారా కొన్నిరోజుల వరకు అనుమతి ఉండదు.
- 10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు.
- కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనాలకు రావద్దు.
- మాస్కులు ధరించడం తప్పనిసరి, శానిటైజేర్స్ వాడాలి.
- అలిపిరి మరియు తిరుమలలో కరోనా టెస్టింగ్ ల్యాబ్స్.
- ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకున్నవారికి అలిపిరివద్ద కరోనా పరీక్షలు.
- వసతి గదుల్లో ఇద్దరికీ మాత్రమే అనుమతి, రెండో రోజూ కొనసాగే అవకాశం ఉండదు.
- తిరుమలలో ప్రైవేట్ హోటళ్లకు అనుమతి లేదు.
- క్యూలైన్ లో రెండుగంటలకొకసారి శానిటైజేషన్
- శ్రీవారి హుండీలో కానుకలు వేసేప్పుడు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu