లాక్డౌన్ అమలులో తాజా సడలింపుల నేపథ్యంలో జూన్ 8 నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పేందుకు అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలను కోరింది. ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జూన్ 4, గురువారం నాడు లేఖ రాశారు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతుంది. రాష్ట్రాల మధ్య బస్సుల సేవల పునరుద్ధరణపై మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే జూన్ 8, సోమవారం నుంచి హైదరాబాద్, కర్ణాటక, ఇతర నగరాలకు ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu