ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జనవరి 11, శనివారం నాడు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్తో సతీష్రెడ్డి పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య రాష్ట్రంలోని రక్షణ రంగ ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణంపై సతీష్ రెడ్డి సీఎంతో చర్చించారు. భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన విందును సతీష్రెడ్డి స్వీకరించారు.
[subscribe]