ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులను నియమిస్తూ జనవరి 10, శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ దొనడి రమేశ్ లు నియమితులయ్యారు. ముందుగా వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నలుగురి నియామకంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకుంది. హైకోర్టు న్యాయమూర్తులగా నియమితులైన ఈ నలుగురితో జనవరి 13, సోమవారం నాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
[subscribe]