వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి మరో వైసీపీ నేత

Big Shock for YCP Another YCP Leader Joins TDP, Big Shock for YCP, Another YCP Leader Joins TDP, YCP Leader Joins TDP, AP Politics, Bhava Kumar, TDP, YCP, Naralokesh, Latest YCP News, Latest YCP Candidates News, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
AP Politics, Bhava Kumar, TDP, YCP, Naralokesh

ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. మొన్నటి వరకు ఓ పార్టీ జెండా మోసిన వారు.. తెల్లవారేసరికి ప్రత్యర్థి పార్టీ జెండాతో కనిపిస్తున్నారు. ఒంటిపై షర్ట్ మార్చినంత ఈజీగా పార్టీ కండువాలను మార్చేస్తున్నారు. టికెట్ దక్కలేదని.. పార్టీలో ప్రధాన్యత లేదని.. అసంతృప్తితో నేతలు పార్టీలు మారుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముంగిట ఏపీలో జంపింగ్ రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఇప్పటికే వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు తెలుగు దేశం బాట పట్టారు. టికెట్ దక్కలేదని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరో వైసీపీ కీలక నేత తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2019 ఎన్నికల్లో భవకుమార్‌కు వైసీపీ విజయవాడ తూర్పు టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో భవకుమార్ ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీ అధిష్టానం కూడా ఆయన్ను పక్కకు పెట్టేసింది. అటు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్‌ను విజయవాడ తూర్పు ఇంఛార్జ్‌గా జగన్ నియమించారు.

గతంలో భవకుమార్‌కు రాష్ట్రస్థాయిలో కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. అసలు పార్టీలో ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా.. పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను పక్కకు పెట్టేయడంతో భవకుమార్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భవకుమార్‌కు టికెట్ కష్టమేననే వాదన వినిపిస్తోంది. భవకుమార్‌ను పక్కకు పెట్టి దేవినేని అవినాశ్‌కు టికెట్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట. త్వరలో విడుదల చేసే నాలుగో జాబితాలో కూడా అవినాశ్ రెడ్డి పేరు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

ఈక్రమంలో భవకుమార్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీ మారేందుకు భవకుమార్ సిద్ధంగా ఉన్నారని తెలిసి.. టీడీపీ నేత వంగవీటి రాధా ఆయన్ను కలిశారు. తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీలో చేరేందుకు భవకుమార్ సిద్ధమయ్యారు. ఇటీవల విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని చిన్నిలతో కలిసి భవకుమార్.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో భవకుమార్ తెలుగు దేశం పార్టీలో చేరనున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − seven =