ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9276 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నాలుగు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూల్ లో 1234, విశాఖపట్నంలో 1155, అనంతపూర్ లో 1128, గుంటూరులో 1001 నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, అనంతపూర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 1, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 150209 కు చేరింది. మరో 12750 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76614 కి చేరింది. ప్రస్తుతం 72188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1407 కి చేరుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu