ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి శనివారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. శోభా హైమావతి 1999లో టీడీపీ తరుపున విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట (ఎస్.కోట) ఎమ్మెల్యేగా, అలాగే తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారికి తగిన గుర్తింపు లేదంటూ, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శోభా హైమావతి ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ