ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఉండవల్లి మరో లేఖ

Andhra Pradesh, AP CM YS Jagan, AP CM YS Jagan Mohan reddy, EX MP Undavalli Arun Kumar, Mango News Telugu, rajahmundry, rajahmundry high court bench, Undavalli, Undavalli Arun Kumar Lette To AP CM, Undavalli letter to Jagan, YS Jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటీవలే మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన సీఎం వైఎస్ జగన్ కు మరో లేఖ రాశారు. రాజమండ్రిలోని తెలుగు విశ్వవిద్యాలయాలనికి చెందిన స్థలాలను ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడం సరికాదని ఉండవల్లి లేఖలో పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం యొక్క 20 ఎకరాలను భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చేయాలని ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉండవల్లి తప్పుబట్టారు.
తెలుగు రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించి షెడ్యూల్ పదిలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా ఏ విధంగా విభజించుకోలేదని లేఖలో గుర్తుచేశారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని, వాటిని వెంటనే నిలిపేసేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ను లేఖ ద్వారా ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు.
[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eleven =