ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ మార్పిడి అనంతర సమస్యలతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా వసంత్కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పూండ్ల గ్రామం. ఇక విద్యాభ్యాసం తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇక వైఎస్సార్ అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులైన కొణిజేటి రోశయ్య మరియు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లోనూ వట్టి గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన ఆయన 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతి తెలుపుతున్నారు. ఈరోజు సాయంత్రం వసంత్ కుమార్ స్వస్థలం పూండ్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని వట్టి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE