ఉత్తర్ప్రదేశ్లో రాష్ట్రంలోని ఔరయ వద్ద మే 16, శనివారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి వలస కూలీలతో ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న ట్రక్కు ఔరయ వద్ద మరో ట్రక్కును ఢీకొట్టడంతో 24 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చిన రెండు ట్రక్కులు బలంగా ఢీకొనడంతోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితులను బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన వలసకూలీలుగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ఉత్తర ప్రదేశ్లోని ఔరయ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చాలా విషాదకరం. ప్రభుత్వం సహాయక చర్యల్లో బిజీగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను, అలాగే గాయపడినవారంతా వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని” ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu