గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం వైద్యులు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇసిజి, 2డి ఎకో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. వంశీ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ పంజాబ్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. మొహాలిలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా వల్లభనేని వంశీకి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో గతేడాది సీటు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన పబ్లిక్ పాలసీ కోర్సులో అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయడానికై పంజాబ్లోని మొహాలీ క్యాంపస్లో తరగతులకు సోమవారం నుంచి హాజరవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తరగతులకు హాజరైన సందర్భంలో వంశీకి ఒక్కసారిగా ఎడమ చేయి లాగుతున్నట్లుగా అనిపించడంతో సహాయకులు ఆస్పత్రికి తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY