గన్నవరం టిడిపి రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదని, తానెప్పుడూ టీడీపీని తిట్టలేదని అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే వల్లభనేని వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. నిన్న, మొన్నటిదాకా టీడీపీపై దుమ్మెత్తిపోసిన వల్లభనేని ఇలా ఒక్కసారిగా మాట్లాడటంపై జోరుగా చర్చ జరుగుతోంది. 2019లో టీడీపీ తరపున గన్నవరం నుంచి గెలిచినా అనంతరం కొన్ని రోజులకే వైసీపీ పక్షాన చేరిపోయిన వంశీ ఇప్పుడు ఇలా మాట్లాడటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీలో నెలకొన్న అంతర్గత పోరు కారణంగా అక్కడ ఇమడలేకపోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ క్రమంలో.. హనుమాన్ జంక్షన్ వద్ద ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వల్లభనేని వంశీ గన్నవరం వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైసీపీలో తనతో గిట్టనివారి గురించి పట్టించుకోనని, తనతో కలిసి వచ్చే వారిని కలుపుకుపోతానని, పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని పేర్కొన్నారు. అలాగే తానెప్పుడూ టీడీపీని తిట్టలేదని, అది చాలా గొప్ప పార్టీ అని వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా లోకేష్ తీసుకుంటున్న కొన్ని విధానాలపై మాత్రమే తాను విభేదించానని అన్నారు. వంశీ చేసిన ఈ వ్యాఖ్యలపై అటు అధికార వైసీపీలో, ఇటు ప్రతిపక్ష టీడీపీలో ప్రత్యేక చర్చ నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF