జనసేన పార్టీ కీలక నేత, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు జూన్ 1వ తేదీ నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా, జూన్ 2 న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖపట్నం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారని తెలిపారు. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉండి, ముఖ్యమైన సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి నిర్దేశం చేయనున్నారు.
అలాగే పార్టీ ఎదుగుదలకు దోహదపడే అభిప్రాయాలు స్వీకరిస్తారని తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నాయకులను ఈ పర్యటన సందర్భంగా నాగబాబు పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న నాగబాబుకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF