గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసముంటున్న ప్రాంతం రెడ్ జోన్లో పరిధిలోకి వస్తుందంటూ ఒక్కసారిగా వార్తలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ వార్తలను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఖండించారు. తాడేపల్లిలో సీఎం నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదని చెప్పారు. నాలుగు పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతం రెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని, తాడేపల్లిలో ఒక్క కేసు మాత్రమే నమోదయిందని తెలిపారు.
ముందుగా తాడేపల్లి పాత టోల్ గేట్ సమీపంలో నివాసం ఉండే వృద్ధురాలు ఈ రోజు చనిపోయింది. ఆమె అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆమె మృతి చెందిన అనంతరం కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమె నివాసం ఉండే ప్రాంతం, సీఎం వైఎస్ జగన్ నివాసానికి సమీప దూరంలోనే ఉండడంతో రెడ్ జోన్ పరిధిలోకి సీఎం నివాసమంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అనంతరం ఈ వార్తలను ఖండిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వివరణ ఇచ్చారు. మరోవైపు ఆయన గుంటూరులోని జీజీహెఛ్ ను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ ఆసుపత్రిలో కొంత భాగాన్ని కోవిడ్ హాస్పిటల్ గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu