ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 7948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7948 కేసులతో కలిపి జూలై 28, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 110297 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) రికార్డ్ స్థాయిలో 62979 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో మరో 58 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన గుంటూరులో పదకొండు మంది, కర్నూల్ లో పది మంది, విశాఖపట్నంలో తొమ్మిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, విజయనగరంలో నలుగురు, నెల్లూరులో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కడపలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1148 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 52622 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 56527 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu