టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాపాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24, శుక్రవారం సాయంత్రం యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో ‘హలో లోకేష్’ (తిరుపతి సేస్ హలో లోకేష్) ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో యువత సంధించిన పలు ప్రశ్నలకు నారా లోకేష్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా అనే ప్రశ్నకు నారా లోకేష్ సమాధానమిస్తూ, నూరుకి నూరు శాతం అని అన్నారు. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశీస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్ళాలి, ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశీస్తారో వాళ్లు అందరూ రాజకీయాల్లోకి రావాలి అని కోరుకుంటున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. ఇక హలో లోకేష్ ఈవెంట్ పై నారా లోకేష్ స్పందిస్తూ, తిరుపతిలో యువకులతో జరిగిన సంభాషణలను పూర్తిగా ఆనందించానని చెప్పారు. హలో లోకేష్ ఈవెంట్ లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈలాంటివి భవిష్యత్తులో మరెన్నో చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE