శ్రీవాణి టికెట్లకు సంబంధించిన మార్చి, ఏప్రిల్, మే నెలల ఆన్లైన్ కోటాను ఈ రోజు (ఫిబ్రవరి 25, శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో రోజుకు 500 టికెట్లు చొప్పున భక్తులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు 2023, ఫిబ్రవరి 24న మొత్తం 61,265 యాత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. 27,078 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ కానుకలు రూ.3.33 కోట్లు వచ్చినట్టు తెలిపారు. 18 కంపార్ట్మెంట్స్ లో భక్తులు వేచిఉండగా, టోకెన్స్ లేని వారికీ సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE