గుంటూరు జిల్లా కలెక్టర్గా వివేక్ యాదవ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఆయన బాధ్యతలను చేపట్టారు. ముందుగా ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి మూడు పేర్లతో పంపిన ప్యానల్ నుంచి వివేక్ యాదవ్ను నియమించాలని ఎస్ఈసీ సూచనల మేరకు వివేక్ యాదవ్ను గుంటూరు కలెక్టర్ గా నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వివేక్ యాదవ్ 2008 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఇప్పటివరకు ఆయన కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా వచ్చారు.
2013-2014 మధ్య వివేక్ యాదవ్ గుంటూరు జాయింట్ కలెక్టర్ గానూ పని చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ సబ్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించారు. తర్వాత వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా, తర్వాత గుంటూరు, శ్రీకాకుళం జేసీగా, విజయనగరంలో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఉన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న దినేశ్ కుమార్ నుంచి వివేక్ యాదవ్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ