ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య వ్యవస్థలో ఇటీవల తీసుకొచ్చిన పలు మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జూలై 1 న విజయవాడలో సీఎం వైఎస్ జగన్ ఒకేసారిగా 1088 అధునాతన అంబులెన్స్లను ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటుంది. జూలై 3 నాటికీ రాష్ట్రంలో మొత్తం 9,71,611 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu