ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,621 కరోనా పాజిటివ్ కేసులు, 92 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10,621 కేసులతో కలిపి ఆగస్టు 27, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 3,93,090 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 61,300 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన కర్నూల్ జిల్లాలో పదమూడు మంది, నెల్లూరులో పదకొండు మంది, తూర్పుగోదావరిలో పది మంది, చిత్తూరులో తొమ్మిది మంది, కడపలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో నలుగురు, విజయనగరంలో నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3633 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 2,95,248 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 8528 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 94209 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu