తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1213 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 2, గురువారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,570 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 5356 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 275 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 987 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 9069 కి చేరింది. ప్రస్తుతం 9226 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1213):
- జీహెచ్ఎంసీ ఏరియా – 998
- మేడ్చల్ – 54
- రంగారెడ్డి – 48
- ఖమ్మం – 18
- వరంగల్ రూరల్ – 10
- వరంగల్ అర్బన్ – 9
- నల్గొండ – 8
- సంగారెడ్డి – 7
- మహబూబ్ నగర్ – 7
- భద్రాద్రి కొత్తగూడెం – 7
- రాజన్న సిరిసిల్ల – 6
- నిజామాబాద్ – 5
- కరీం నగర్ – 5
- మహబూబబాద్ – 5
- సూర్యాపేట – 4
- ములుగు – 4
- జగిత్యాల – 4
- నిర్మల్ – 4
- కామారెడ్డి – 2
- నారాయణ పేట్ – 2
- గద్వాల్ – 1
- సిద్ధిపేట – 1
- మెదక్ – 1
- యాదాద్రి – 1
- నాగర్ కర్నూల్ – 1
- వికారాబాద్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu