ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రముఖ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ నటించగా, ఘన విజయం సాధించిన ‘వీర సింహారెడ్డి” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాలో శృతి హాసన్, వరలక్ష్మి శరత్కుమార్, హనీ రోజ్, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా దిగ్గజ నటుడు ఎన్టీఆర్ నటించిన చండశాసనుడుని గుర్తు చేసిందని చెప్పారు. ఈ సినిమాలో బాలకృష్ణ విశ్వరూపం చూపించారని అన్నారు. వీర సింహారెడ్డి సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ డిజైన్, నటినటుల పెర్ఫార్మన్స్, దర్శకుడి ప్రతిభ సహా పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇