జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపడుతున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఏలూరు చేరుకోగా వేల సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా ముందుగా జానంపేటలో కౌలు రైతు మల్లికార్జునరావు కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించి, పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించారు. అనంతరం ధర్మాజీగూడెంలో కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన మొత్తం 40 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అనంతరం చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తో పాటుగా పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు సహా పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ