ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాల్లో టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. యుద్ధవీరుల నివాళుల కోసం నేషనల్ డిఫెన్స్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుపబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో రామ్ చరణ్ యుద్ధవీరులకు పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో మన సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉండటం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని అన్నారు. ఎంతోమంది వీర జవానులు చేసిన త్యాగాల వలననే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు. మనం పీల్చే గాలి, నడిచే నెల మీద అమర జవానుల చెరగని సంతకం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో పాల్గొనటం నా అదృష్టం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులతో పాటు నగరంలోని పలు స్కూల్స్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ